26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మేజర్. ఈ చిత్రంలో అడవి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి డైరెక్టర్ శశికిరణ్ దర్శకత్వం వహించారు. మహేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమాతో భాగస్వాములుగా అయ్యారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా మేజర్ చిత్ర యూనిట్ సభ్యులు పాఠశాల విద్యార్థులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది. ఈ సినిమాలో ఉన్నికృష్ణన్ కథా అంశాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకు టికెట్ పై 50 శాతం రాయితీ ఇవ్వబోతున్నట్లు గా ప్రకటించారు.

పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక హోదా కోసం..majorscreening@gmail.com కు మెయిల్ చేస్తే.. మేజర్ టీమ్ ఆ స్కూల్ విద్యార్థులకు ఒక స్పెషల్ షో ని ఏర్పాటు చేస్తోందని తెలియజేశారు. ఇందుకు సంబంధించి అడవిశేషు ఒక స్పెషల్ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో అడవి శేషు మాట్లాడుతూ మేజర్ సినిమా ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకులకు తన ధన్యవాదాలు అని తెలియజేశారు. కొద్ది రోజులుగా ఎంతో మంది చిన్నారులు తనకు ఫోన్ చేసి సోషల్ మీడియాలో మెసేజ్ లు చేసి సినిమా గురించి మాట్లాడుతున్నారట.

వాళ్లందరికీ కూడా మేజర్ సినిమా బాగా నచ్చింది. మేము మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాగా దేశం కోసం పోరాడుతామని వారు చెప్పడంతో తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపాడు. ఈ చిత్రం పిల్లలకు కూడా బాగా కనెక్ట్ అవడంతో ఈ సందర్భంగా నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. మరింత మంది విద్యార్థుల కోసం ఈ సినిమా చూడడానికి గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నాము అని తెలియజేశారు. సందీప్ గురించి తెలియాలని లక్ష్యంతోనే ఇలాంటి పని చేస్తున్నామని అడవిశేషు తెలియజేశారు ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: