అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఇప్పుడు రెండవ భాగం భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. అందుకోసమే ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. ఎప్పుడో పూర్తయిన స్క్రిప్ట్ లో సైతం భారీ మార్పులు చేస్తూ సుకుమార్ పెరిగిన అంచనాలకు తగ్గట్లుగా సినిమాను రూపొందిస్తున్నాడు. దీనికి అల్లు అర్జున్ కూడా సహాయ పడడం ఈ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కుతోంది అనడానికి నిదర్శనం.

మైత్రి మూవీ మేకర్స్ వారు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అందరూ కూడా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హీరో అల్లు అర్జున్ అయితే ఏకంగా 40 కోట్ల పారితోషికాన్ని ఈ సినిమా ద్వారా తీసుకోబోతున్నాడు అని అంటున్నారు. అంతేకాదు సుకుమార్ కూడా తాను మొదటి భాగానికి తీసుకున్న పారితోషికం కంటే రెట్టింపు పారితోషకం ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడట. ఆ విధంగా ఈ సినిమాపై అంచనాలను రోజురోజుకు వీరందరూ పెంచుతున్నారు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉండబోతుందట.  ఈ సినిమా క్లైమాక్స్ లో దీన్ని రివీల్ చేయబోతున్నారు అని అంటున్నారు. వాస్తవానికి పుష్ప సినిమాకు రెండవ భాగం ఉండడమే చాలామంది మెగా అభిమానులకు నచ్చలేదు. ఇలాంటి సినిమాకు రెండు భాగాలు చేయవలసిన అవసరం లేదని ఒకే భాగంలో పూర్తి చేసి ఉంటే బాగుండేది అని వారు చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు మూడవ భాగం కూడా ఈ సినిమాకి ఉంటే ఈ చిత్రంపై క్రేజు తగ్గే అవకాశం ఉంటుందని టాలీవుడ్ లో క్లాసికల్ హిట్స్ గా నిలిచిన ఈ సినిమా ఎంత తక్కువ గా ఉంటే అంత మంచిది అని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ రావాలంటే చిత్ర బృందం లో ఎవరో ఒకరు ఈ మూడవ భాగం పై క్లారిటీ ఇవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: