ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ.ఇక ఈ సినిమాలో చరణ్ మీ జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించడం జరిగింది.ఇకపోతే  ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే.అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా చరణ్ అభిమానులకు సైతం నచ్చలేదు. కాగా  చరణ్ కియారా అద్వానీ కాంబినేషన్ లో మరో సినిమా శంకర్ డైరెక్షన్ లో ఫిక్స్ అయింది. అయితే వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత కియారా సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇదిలావుండగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు కియారా అద్వానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక మరో కారణం ఉందని సమాచారం అందుతోంది. అయితే శంకర్ సినిమాలో గ్లామర్ గా కనిపించడంతో పాటు ఈ సినిమా ద్వారా నటిగా కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉండటంతో కియారా ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిన వెంటనే ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఇదిలావుంటే ప్రస్తుతం ఇప్పుడు  కియారా అద్వానీ వరుసగా బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ఇకపోతే సౌత్ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ చరణ్ తో ఉన్న స్నేహం వల్ల కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది.

కాగా భూల్ భూలయ్యా2 సక్సెస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో కియారా అద్వానీకి ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.ఇక  కియారా అద్వానీ హిందీలో నటిస్తున్న పలు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. పోతే కియారా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే శంకర్ సినిమాతో కియారా అద్వానీ మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. అయితే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని బోగట్టా.ఇకపోతే  రామ్ చరణ్ పాత్రకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అంతేకాక దిల్ రాజు ఏకంగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: