రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకుడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ అనే మైథలాజికల్ మూవీ, అలానే సలార్ అనే మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ తో పాటు ప్రాజెక్ట్ కె అనే సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ చేస్తున్నారు. కాగా సలార్ ని ప్రశాంత్ నీల్ తీస్తుండగా ప్రాజెక్ట్ కె ని నాగ అశ్విన్ తీస్తున్నారు.

అయితే వీటిలో ఎక్కువగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో ఆయనకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని పాన్ ఇండియా మూవీగా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే పక్కా మాస్ అంశాలతో పాటు ఆడియన్స్ అందరూ కూడా అన్ని అంశాలు కూడా పొందుపరిచి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో భారీ స్థాయిలో సలార్ ని తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే, వాస్తవానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మే నెల చివరి వారంలో విడుదల కానుంది అంటూ ఇటీవల వార్తలు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

అయితే కొన్ని అనివార్య కారణాల వలన టీజర్ కొన్నాళ్లపాటు వాయిదా పడినట్లు అనంతరం వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం జూన్ ఆఖరి వారంలో సలార్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న సలార్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు టాక్. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా గొప్ప పండుగ వార్తే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: