ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమా అఖండ. బాలయ్య అఘోరాగా, అలానే రైతుగా రెండు విభిన్న పాత్రలు పోషించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఇక రిలీజ్ తరువాత అఖండ ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఆ మూవీ ఇచ్చిన కిక్ తో బాలయ్య ప్రస్తుతం యువ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక మూవీ చేస్తున్నారు.

యువ భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తోంది. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన ఈ ప్రతిష్టాత్మక మూవీ ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యొక్క  ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ఇక టీజర్ కి సూపర్ గా రెస్పాన్స్ రావడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ దసరాగా కానుకగా విడుదల కానున్నట్లు టాక్.

అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు విలన్ గా చేస్తున్న దునియా విజయ్ పాత్ర కూడా అదిరిపోనుందట. ముఖ్యంగా మాస్, యాక్షన్ కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ మూవీ తప్పకుండా రిలీజ్ తరువాత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. దర్శకనిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని అద్భుతంగా  తెరకెక్కిస్తున్నారని, బాలయ్య ఫ్యాన్స్ పక్కాగా బ్లాక్ బస్టర్ అనేది రాసిపెట్టుకోవచ్చని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి దసరా కి విడుదల కానున్న ఈ మూవీ ఎంత మేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: