మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇదిలావుండగా రీఎంట్రీలో చిరంజీవి నటించిన సినిమాలపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల మెగాస్టార్....తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కత్తి సినిమాకు రీమేక్ గా ఖైదీ నంబర్ 150 తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఇకపోతే కమర్షియల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నప్పటికీ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించడం తో ఆఖరికి నష్టమే మిగిలింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాని మెగా కుటుంబమే నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. వీరు నిర్మించడం వల్ల నష్టం చేకూరిందని మెగా ఫ్యామిలీ  సినిమాల నిర్మాణానికి దూరం కావడం జరిగింది.అయితే  ఆ తర్వాత భారీ అంచనాలతో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ నెలలో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇలా ఉంటే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఒకటి.

అంతేకాదు భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం.ఇకపోతే చిరంజీవి, చరణ్ ఈ సినిమా డిజాస్టర్ కావడం వల్ల 10 కోట్ల రూపాయలు వెనక్కు ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైందనే సంగతి తెలిసిందే. కాగా ఆగష్టు రెండో వారం ఈ సినిమా రిలీజవుతుందని అందరూ భావించారు. ఇక అసలు విషయంలోకి వెళితే అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ తర్వాత రిలీజ్ అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా డా.ఆచార్య సినిమా ఎఫెక్ట్ చిరంజీవి సినిమాల మీద ప్రభావం కూడదని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అంతేకాదు చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: