సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు కొంత మంది హీరోయిన్ల హవా కొనసాగడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ముద్దుగుమ్మలకు ఫుల్ క్రేజ్ ఉన్న సమయంలో వారికి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి తమ సినిమాలలో పెట్టుకోవడానికి హీరోలు, దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వారు అడిగినంత రెమ్యునిరేషన్ ను ఇవ్వడానికి ప్రధాన కారణం ఆ ముద్దుగుమ్మలకు ఉండే  క్రేజ్.

అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా ఫుల్ క్రేజీ హీరోయిన్లుగా కొనసాగుటున్న ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా అదిరిపోయే రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు,  అయితే వారు సినిమాలు ఉండటం ద్వారా సినిమా హైప్ పెరుగుతుందనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు కూడా ఆ ముద్దుగుమ్మలు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మొవీలలో పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు క్రేజీ ముద్దుగుమ్మలు ఎవరో కాదు కియారా అద్వానీ , పూజా హెగ్డే.  ప్రస్తుతం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కియారా అద్వానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కియారా అద్వానీ కి సౌత్ ఇండస్ట్రీ నుండి అదిరిపోయే క్రేజీ సినిమా ఆఫర్లు వస్తున్నట్టు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే పూజా హెగ్డే కూడా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పలు అదిరిపోయే క్రేజీ ప్రాజెక్ట్ ఆఫర్ లు కూడా ఈ ముద్దుగుమ్మకు వస్తున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: