ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ గా పేరుగాంచిన మైత్రీ మూవీ మేకర్స్ టాప్ హీరోలందరితోను సినిమాలు చేస్తున్నారు. వరసపెట్టి జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న వీరి సాహసం చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు మైత్రీమూవీస్ మేకర్స్ తో చాల మంచి సాన్నిహిత్యం ఉంది.


ఇప్పుడు ఆ సాన్నిహిత్యంతోనే ఈసంస్థ బుట్టలో మహేష్ పడ్డాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈమూవీ మహేష్ కెరియర్ లో 28వ మూవీ. ఈమూవీ పూర్తి అయిన వెంటనే మహేష్ రాజమౌళి సినిమా వైపు వెళ్ళిపోతాడు. ఆమూవీ మహేష్ సినిమాల సంఖ్యకు సంబంధించి 29వ మూవీ.



వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో మహేష్ కు కూడ తెలియదు. అయితే ఆవిషయాలను పట్టించుకోకుండా మైత్రీ సంస్థ మహేష్ చేయబోయే 30వ సినిమా గురించి ఆలోచనలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారంమేరకు మహేష్ తన 30వ సినిమా డేట్స్ తమ సంస్థకు ఇస్తే మహేష్ కు ఆసినిమాలో నటించినందుకు 100 కోట్ల పారితోషికం ఇస్తామని ఆఫర్ చేయడమే కాకుండా మహేష్ తమ ఎగ్రిమెంట్ పై సంతకం పెడితే ఇప్పుడే 50 కోట్లు అడ్వాన్స్ ఆఫర్ చేసినట్లు టాక్.


అయితే ఈ ప్రపోజల్ విషయమై ఇంకా మహేష్ నుండి అంగీకారం రాలేదని తెలుస్తోంది. రాజమౌళి మూవీ విడుదల తరువాత తన మార్కెట్ ఏమేరకు ఉంటుందో అంచనా వేయడం కష్టం కాబట్టి రెండు సంవత్సరాల తరువాత ప్రారంభం అయ్యే తన 30వ సినిమా గురించి ఇప్పటి నుండే ఆలోచనలు చేయడం మంచిదా కాదా అన్న కన్ఫ్యూజన్ ప్రస్తుతం మహేష్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ ను బట్టి మహేష్ స్థాయి ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: