సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ల్ మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి గీత గోవిందం ఈ సినిమాతో దర్శకుడిగా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న పరశు రామ్ దర్శకత్వం వహించాడు . 

ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నా సర్కారు వారి పాట మూవీ మే 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది . బాక్సాఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు కాస్త మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకున్న సర్కారు వారి పాట మూవీ ఆ టాక్ ప్రభావం ఏ మాత్రం లేకుండా అదిరి పోయే కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర కొల్ల గొట్టింది . అలా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న సర్కారు వారి పాట సినిమా కొన్ని రోజుల క్రితం నుండే తెలుగు వర్షన్ రెంటెడ్ ప్రాసెస్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' సంస్థ సర్కారు వారి పాట మూవీ ని తెలుగుతో పాటు తమిళ , మలయాళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

సర్కారు వారి పాట మూవీ ని తెలుగు తో పాటు తమిళ, మలయాళ భాషల్లో జూన్ 23 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' సంస్థ తాజాగా ప్రకటించింది.  మరి తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించిన సర్కారు వారి పాట మూవీ  తమిళ , మలయాళ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: