దగ్గుబాటి వారసుడిగా.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మొదటినుంచి ఎన్నో విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ హీరోగా,  విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈయన వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా ద్వారా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర అవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం.

ఇకపోతే ఈ సినిమా కి సంబంధించి ఫ్రీ రిలీజ్ వేడుకలు బుధవారం సాయంత్రం చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ్ చరణ్,  విక్టరీ వెంకటేష్ హాజరవుతానని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల రామ్ చరణ్ హాజరు కాలేక పోవడం గమనార్హం. ఇక ఈ వేదికపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తన బాబాయ్ వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు అని కూడా తెలిపారు. ఇక బాబాయ్ లేకుండా తమ ఇంట్లో ఏ కార్యక్రమం కూడా మొదలు అవ్వదు అని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇకపోతే అదేవిధంగా రామ్ చరణ్ కూడా వస్తారని చెప్పినప్పటికీ ఆయన రాకపోవడంతో రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. హీరోయిన్ సాయి పల్లవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు రానా. ఇప్పటివరకు వెంకటేష్ కి  ఉన్న అభిమానులు తనకు కూడా ఉన్నారు అని తెలుపుతూ వచ్చిన రానా ఎప్పుడైతే విరాటపర్వం సినిమా చేయాలని అనుకున్నానో అప్పుడు తెలిసింది నాకు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు అని.. నిజానికి ఈ సినిమా చేస్తున్న సమయంలో ఎంతో మంది అభిమానులు ఈ సినిమాలో నటించవద్దు అని తనకు మెసేజ్ లు కూడా  పెట్టారట. కానీ ఇంత మంది అభిమానులు ఉన్నారు అని అప్పుడే తెలిసింది అని తెలిపారు. రానా మాట్లాడుతూ ఇకపై ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయను అని ఇదే నా చివరి చిత్రం అని కూడా తెలిపాడు. ఇకపై చేసే సినిమాలు అన్నీ కూడా అభిమానుల కోసం మాత్రమే చేస్తానని తెలపడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి: