కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా ఓ టీ టీ లో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఓటీ టి లో ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత విడుదల అవుతుందని అందరూ భావించారు కానీ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదల చేసేందుకు ఎక్కువ సమయం ఉందట. ఈ చిత్రం ఓ టీ టీ రైట్స్ను అమెజాన్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం.
ఇక థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాలు ఈ చిత్రాన్ని విడుదల చేయడం కాకుండా ఎనిమిది వారాల తరువాత లేదా రెండు నెలల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ సూపర్ సెన్సేషనల్ మూవీ ఓ టీ టీ లో చూడాలి అనుకున్న వారికి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు ఈ చిత్రాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి నటించారు ఇతడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇప్పటి వరకు ఈ చిత్ర 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.