ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటించింది.కాగా ఈ సినిమా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ సినిమా చూసిన తరువాత పుష్ప ది రూల్ కోసం ఎదురు చూడని సినీ ప్రేక్షకుడు లేడు.ఇకపోతే ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది. విడుదల అనంతరం 350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అయితే బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది ఈ సినిమా

ఇక సుకుమార్ డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టి ఉత్తరాది ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. కాగా ఇది ఒక్క పార్ట్ తో పూర్తి అవ్వలేదు...ఈ సినిమాకి  సుకుమార్ మరొక పార్ట్ కూడా తీస్తున్నట్టు తెలిపాడు. అంతేకాదు పుష్ప ది రూల్ పేరుతొ ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలావుండగా తాజాగా ఇప్పటికే స్టోరీలో కీలక మార్పులు కూడా సుకుమార్ చేసినట్టు బౌండ్ స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్టు సమాచారం వినిపిస్తుంది.ఇక ఈ క్రమంలోనే తాజాగా  ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే పార్ట్ 1 లో పుష్పరాజ్ ప్రేయసిగా కనిపించిన రష్మిక మందన్న..

ఇక పార్ట్ 2 లో మాత్రం భార్యగా కనిపించనుంది. ఇకపోతే  ఈమె పాత్ర సినిమా మొత్తం ఉండదని.. మధ్యలోనే చనిపోతుంది అని టాక్ వచ్చింది.అయితే సుకుమార్ ఈ పార్ట్ లో మరొక హీరోయిన్ కు కూడా చోటు కల్పించాలని ఈమె పాత్రను చనిపోయినట్టు రాసుకున్నారట. అంతేకాదు పుష్ప 2 కు క్రేజ్ భారీగా ఉండడంతో మరొక పాపులర్ బ్యూటీని పార్ట్ 2 కోసం రంగం లోకి దింపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే మరి శ్రీవల్లిగా అలరించిన రష్మిక మందన్న పాత్ర మధ్యలోనే చనిపోతుంది అని తెలిసి ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు...చూడాలి మరి ఇది కేవలం రూమరా.. లేదంటే నిజమేనా అనేది.ఇదిలావుంటే ఈ సినిమా జులై చివరి వారం నుండి షూట్ స్టార్ట్ చేయబోతున్నారట.అంతేకాక అలాగే స్టార్ట్ చేసినప్పటి నుండి ఎలాంటి అడ్డంకులు లేకుండా సుకుమార్ ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: