సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా, మహానటి కీర్తి సురేష్మూవీ లో మహేష్ బాబు సరసన కథానాయికగా నటించింది. భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస విజయాల తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడం , గీతా గోవిందం లాంటి పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం తో సర్కారు వారి పాట మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ మే 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుని కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట సినిమా హైదరాబాద్ లోని ఏ ఎం బి సినిమాలో ఒక అరుదైన రికార్డ్ ను సృష్టించింది. హైదరాబాద్ లోని ఏ ఎం బి సినిమాస్ లో సర్కారు వారి పాట మూవీ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తర్వాత అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీ గా ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లను సాధించింది. ఏ ఎం బి సినిమాస్ లో సర్కారు వారి పాట  మూవీ 2 కోట్ల సాలిడ్ గ్రాస్ తో మొట్ట మొదటి సారిగా ఈ ఫీట్ అందుకున్న రీజనల్ మూవీ గా రికార్డ్ ను సృష్టించింది.  

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సముద్ర ఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా,  వెన్నెల కిషోర్ మరో ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. తమన్మూవీ కి అందించిన పాటలు కూడా ఈ మూవీ విషయంలో కీలక పాత్రను పోషించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: