పూరీ జగన్నాథ్..  పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. లేరు అంటే అతియసోక్తి కాదేమో.ఇక ఈయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అగ్ర దర్శకుడిగా టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్నాడు.అయితే మేకర్ గా తన కెరీర్ లో పూరీ చాలా సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. అయితే తాజాగా ప డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేసాడు.ఇక ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచాడు.ఇకపోతే లైగర్ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేసారు. కాగా ఈ సినిమా తర్వాత వెంటనే పూరీ గ్యాప్ లేకుండా తన నెక్స్ట్ సినిమా జనగణమన కూడా ప్రకటించాడు.

ఇకపోతే  లైగర్ రిలీజ్ కాకుండానే మరొక పాన్ ఇండియా సినిమా సార్ట్ చేసి పూరీ అందరికి షాక్ ఇచ్చాడు.ఐరహే  ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండనే హీరోగా నటిస్తున్నారు.ఇప్పుడు ప్రెసెంట్ పూరీ జనగణమన షూటింగ్ స్టార్ట్ చేసి వేగంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే  ఈయన సంగతి పక్కన పెడితే పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ కూడా నిర్మాతగా సినీ రంగంలోకి ప్రవేశించబోతుంది అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈయన స్టార్ డైరెక్టర్ గా ఉంటే ఈయన కుమారుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం  ఇప్పుడు ఈయన కూతురు కూడా నిర్మాతగా మారి చక్రం తిప్పడానికి సిద్ధం అవుతుంది.

ఇకపోతే పూరీ నిర్మాతగా కూడా మారి వైష్ణో అకాడమీ అనే పేరుతొ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు చేసాడు.కాగా  ఆ తర్వాత ఇదే సంస్థను పూరీ కనెక్ట్స్ గా మార్చి ఛార్మీ ను కూడా భాగస్వామ్యం చేసుకుని ఆమెకు నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు. అయితే  ఇదే సంస్థలో పవిత్ర పూరీ భాగస్వామ్యం అవుతున్నట్టు టాక్.కాగా పవిత్ర ఇటీవలే ఎంబీఏ పూర్తి చేసిందట..అంతేకాదు మరికొద్ది రోజుల్లోనే పూరీ కనెక్ట్స్ బాధ్యతలు ఈమె చేతుల్లోకి వెళ్లనున్నాయని సమాచారం అందుతుంది. అయితే మరి అతికొద్ది మంది ఉన్న లేడీ నిర్మాతల్లో ఈమె కూడా స్థానం సంపాదించుకుని సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుందో లేదో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: