పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా.. అకీరానందన్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అటు తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ను కానీ ఇటు తల్లి ఇన్ఫ్లుయెన్స్ ను కానీ ఏ మాత్రం వినియోగించుకోకుండా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. అంతేకాదు స్వతహాగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడంతో ప్రతి ఒక్కరు కూడా అకీరానందన్ ప్రతిభకు ఫిదా అవుతున్నారు. అకీరా నందన్ పియానో చాలా అద్భుతంగా వాయిస్తారు అని అందరికి తెలిసిందే.. ఎన్నో పాటలకు అకీరానందన్ పియానో అద్భుతంగా వాయించారు.

ఇకపోతే అకీరానందన్ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి నటనపై శిక్షణ కూడా పూర్తి చేశాడు. ఇక ఇదిలా ఉండగా సంగీతంపై ఎక్కువగా మక్కువ  ఉండటం కారణంగా సంగీత దర్శకత్వం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు . ఇకపోతే తాజాగా అడవి శేష్ హీరోగా వచ్చిన మేజర్ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో హృదయమా అంటూ సాగే ఈ పాటను కీబోర్డు సహాయంతో కంపోజ్ చేశారు అకీరానందన్. ఇక ఈ కంపోజ్ చేసిన వీడియోను అడవి శేషు కు షేర్ చేయగా.. ఆ వీడియో అతను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం చాలా వైరల్  గా మారుతోంది . అంతేకాదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే అడవిశేషు ట్విట్టర్ ద్వారా ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఈ పాటను కంపోజ్ చేసి పంపినందుకు థాంక్యూ అఖీరా అంటూ తెలిపాడు. ఈ వీడియో పై నెటిజన్ల నుంచి కూడా భారీ స్పందన లభిస్తోంది. జూనియర్ పవర్ స్టార్ అంటూ ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఇకపోతే అకీరా తన స్కూల్ గ్రాడ్యుయేషన్ డే రోజు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని దోస్తీ పాటకు పియానో వాయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇక ఈ క్రమంలోనే ఇలా మేజర్ సినిమా పాటకి కూడా కంపోజ్ చేయడం తో ప్రతి ఒక్కరు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: