సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కించిన తాజా చిత్రం సర్కారు వారి పాట . ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం మే 12న విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను కురిపించింది. దాదాపుగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ చిత్రం గుర్తింపు తెచ్చుకుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న అంశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చేలా చేశారు డైరెక్టర్ పరుశురాం.

సినిమా విజయంలో ఈ సినిమాలోని పాటలు కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించాయని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా కళావతి వంటి క్లాసికల్ సాంగ్ తో పాటు.. మ..మ.. మహేషా అనే ఒక మాస్ సాంగ్ విపరీతంగా ప్రేక్షకులను , అభిమానులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, వీడియో సాంగ్ రూపంలో విడుదల చేశారు. శ్రీకృష్ణ , జోనిత గాంధీ పాడిన ఈ పాట అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.

మహేష్ బాబు మాస్  స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అవ్వడమే కాకుండా.. మహేష్ బాబు ఇంతలా మారిపోయాడు ఏంటి అని అంతా అలా చేశారని చెప్పవచ్చు. ఇక యూట్యూబ్ లో సైతం ఈ పాట రికార్డులను సృష్టిస్తోంది రిలీజ్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల వ్యూస్ ని రాబట్టి దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం  ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నది. ఇక జూన్ 23 వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూడవచ్చు. ఏది ఏమైనా మహేష్ బాబు కెరీర్లో విభిన్నమైన చిత్రంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: