పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈయన ఇటీవల రాధేశ్యామ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌  హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్‌ కె.అయితే మహానటితో ప్రశంసలు అందుకున్న నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇకపోతే బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె  మొదటిసారి నేరుగా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించబోతోంది.

 అంతకాక సైన్స్‌ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.అయితే  ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడిందంటూ రూమర్లు వస్తున్నాయి. కాగా ఇటీవల దీపికా అస్వస్థతకు గురికావడంతో ప్రభాస్‌ మూవీ షూటింగ్‌ను వాయిదా వేయాలని దర్శక నిర్మాతలను కోరాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే తాజాగా ఈ రూమర్లపై ప్రాజెక్ట్‌ కె చిత్రబృందం స్పందించింది. ఇక ఈ షూటింగ్‌ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.ఇదిలావుండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ కె షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

 ఇకపోతే  ఇక్కడ షూటింగ్‌లో పాల్గొన్న దీపిక హఠాత్తుగా అనారోగ్యానికి గురైంది.అయితే  ఆస్పత్రిలో కూడా చేరింది. ఇక దీంతో ఆప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ  సినిమా షూటింగ్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదు. అయితే ముందుగా షెడ్యూల్‌ చేసుకున్నట్లే షూటింగ్ సజావుగా జరుగుతోంది’ అని నిర్మాత అశ్వనీదత్‌ క్లారిటీ ఇచ్చాడు. ఇదిలావుంటే  ప్రస్తుతం ఇప్పుడు  దీపిక, అమితాబ్‌ బచ్చన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లోని సీన్స్‌ ఈ నెల 20తో పూర్తవుతాయట.ఇకపోతే  ఆ తర్వాత ఈ నెల 21 నుంచి ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. అంతేకాక దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యూల్‌ జరగనుందని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: