సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన అందానికి అందరూ ముగ్ధులై పోవాల్సిందే. అయితే తాజాగా సూపర్స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో మహేష్ బాబు నటిస్తే ఆ సినిమా హిట్ అనే భావన కూడా ప్రేక్షకులలో బలంగా పాతుకు పోయింది.ఇక ఈ క్రమంలోనే  మహేష్ మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట ఇలా వరుసగా సినిమాలతో విజయాలు అందుకుంటూ సూపర్ హిట్ గా నిలిచాడు. కాగా  ఈయన సినిమాలతో మంచి లాభాలను సొంతం చేసుకోవడమే కాకుండా పలు రకాలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నాడు.

ఇక ఇదిలావుంటే మహేష్ బాబు తాజాగా యూరప్ లో ఉన్న విషయం తెలిసిందే . కాగా వెకేషన్ కోసం ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్లిన ఆయన అమెరికాకు త్వరలోనే వెళ్లనున్నట్లు సమాచారం. ఇక అసలు విషయం ఏమిటంటే ....ఈ క్రమంలోనే అక్కడ ఒక ప్రాపర్టీని కూడా కొనుగోలు చేయాలని భావిస్తున్నారట.అంతేకాక  రెండు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఈయన ఆసక్తి చూపిస్తూ ఉండటం గమనార్హం. అంతేకాదు ఈయన ఏకంగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ ఆ ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సినీ ఇండస్ట్రీలో ఈ వార్త బాగా చక్కర్లు కొడుతున్నా ఇందుకు సంబంధించిన నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా జూలై లో షూటింగ్ మొదలు కానుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. అయితే  ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా పూజాహెగ్డే నటిస్తున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: