టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న మాస్ హీరోలలో ఒకరైన గోపీచంద్ తాజాగా పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్న మధ్యలో కరోనా రావడం , ఆ తర్వాత కొంత కాలం పాటు పక్కా కమర్షియల్ మూవీ ని హోల్డ్ లో పెట్టి మంచి రోజులు వచ్చాయి మూవీ ని మారుతి తెరకెక్కించడం తో ఈ సినిమా మరింత డిలే అయ్యింది.

అలా అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. మంచి రోజులు వచ్చాయి సినిమా తర్వాత పక్కా కమర్షియల్ సినిమా పనులను మారుతీ పూర్తి చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. జులై 1 వ తేదీన ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ ని గీతా ఆర్ట్స్‌-2 ,  యూవీ క్రియేషన్స్ బ్యానర్ లపై అల్లు అరవింద్ , బన్నీ వాసు తెరకెక్కించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా పక్కా కమర్షియల్ సినిమా దర్శకుడు  మారుతి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు.

అసలు విషయం లోకి వెళితే... దర్శకుడు మారుతి సోషల్ మీడియా వేదికగా అల్లు అరవింద్ గారు సరైన తీర్పు గల వ్యక్తి,  పక్కా కమర్షియల్ మూవీ ఫైనల్ కాపీ ని చూసిన ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పక్క కమర్షియల్ టీమ్ కి ఇది ఒక శుభసూచికం అని మారుతి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు జేక్స్‌ బిజోయ్ సంగీతం సమకూర్చాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: