మహేష్ అభిమానులు సర్కార్ వారి పాట సినిమా తో పూర్తి స్థాయి లో సంతోషపడలేదు. సినిమాలో మహేష్ ను ఎలివేట్ చేసిన అంశాలు బాగానే ఉన్నా కూడా కథలో అక్కడక్కడా లోపాలు ఉండడం వల్ల ఈ సినిమా అందరిని వందశాతం మెప్పించలేకపోయింది. అందుకే ఈ సారి మహేష్ బాబు చేయబోయే సినిమా ఫుల్ మీల్స్ పెట్టాలని మహేష్ అభిమానులు భావించారు. అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూడసాగారు.

అలవైకుంఠపురంలో సినిమా తరువాత త్రివిక్రమ్ చాలా గ్యాప్ తీసుకుని మరీ మహేష్ తో తన సినిమా ను మొదలుపెట్టబోతున్నాడు. గతంలో వీరి కలయిక లో వచ్చిన సినిమాల కంటే కూడా భారీ రేంజ్ లో ఈ సినిమా ఉండాలని చెప్పి ఆయన ఓ అద్భుతమైన కథ రెడీ చేశాడని సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తుంది. ఈనేపథ్యంలో త్వరగా ఈ సినిమా ను మొదలుపెట్టి పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాడాలని మహేష్ ఫ్యాన్స్ భావించారు.

కానీ మహేష్ ఇంకా ఫ్యామిలీ టూర్ లో ఉండడం ఇంకా ఈ సినిమా మొదలు కాకపోవడానికి కారణం. మహేష్ తన ప్రతి సినిమా విడుదల తర్వాత ఫ్యామిలీ తో టూర్ కి వెళ్తూ ఉంటాడు. అలా ఈ సారి సర్కార్ వారి పాట తర్వాత ఆయన టూర్ కి వెళ్లి ఇంకా రాకపోవడం తో ఈ సినిమా మొదలుకావడం లేదు. దాంతో ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.  జులై నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది అని చెబుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్సినిమా ను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి. పూజ హెగ్డేసినిమా లో కథానాయికగా నటిస్తుండగా యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా మరో కథానాయికగా నటిస్తుంది. మరికొంతమంది బాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమా లో నటిస్తున్నారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: