రామ్ చరణ్ హీరో గా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ సినిమాలు చేసే దర్శకుడిగా పేరున్న శంకర్సినిమా ను కూడా భారీ చేస్తున్నాడు. తమిళనాడు లో ఆయన కున్న క్రేజ్ అంతా ఇంత కాదు అయితే గత కొన్ని రోజులుగా అక్కడ ఆయన పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అందుకే తెలుగులో ఆయన సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అలా రామ్ చరణ్ తో సినిమా చేస్తుండగా ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని విశేషం.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తో తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను రెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా చేసిన తర్వాత ఓ భారీ దర్శకుడుతో సినిమా చేయాలనీ శంకర్ ను ఎంచుకున్నాడు రామ్ చరణ్. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా మల్టీ స్టారర్ కావడంతో రామ్ చరణ్ ఆ సినిమా విజయాన్ని పూర్తిగా రామ్ చరణ్ కి ఇవ్వలేకపోతున్నాడు. ఎన్టీఆర్ కి కొంత రాజమౌళి కి కొంత హిట్ క్రెడిట్ లో షేర్ ఇవ్వాల్సి వచ్చింది

అందుకే మెగా ఫ్యాన్స్ మళ్ళీ ఓ హిట్ సినిమా అవసరమని, రామ్ చరణ్ సత్తా పాన్ ఇండియా వైడ్ గా సోలోగా తెలియజేయాలని చెప్తున్నారు. అందుకు శంకర్ సినిమా ఉపయోగపడాలని సూచిస్తున్నారు. మరి చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకుని చేస్తన్న ఈ సినిమా ఏ స్థాయి లో ఉండబోతుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా గా రాబోతుంది. ఇటీవలే జెర్సీ బాలీవుడ్ సినిమా ను పూర్తి చేసిన గౌతమ్ త్వరలోనే ఈ సినిమా పనులలో నిమగ్నమవనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: