అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా యొక్క రెండవభాగం పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్న సుకుమార్ త్వరలోనే ఈ చిత్రం యొక్క రెండో భాగం పై షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో తప్పకుండా పుష్ప సినిమాకు మించిన విజయాన్ని అందుకోవాలని ఇద్దరు కూడా భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తుంది.


వాస్తవానికి పుష్ప సినిమా విడుదలైనప్పుడు ఆ చిత్రానికి అంతటి స్థాయిలో విజయం దక్కుతుందని ఎవరు కూడా ఊహించలేదు. అనూహ్యంగా ఆ సినిమాకు నార్త్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ రావడంతో ఈ సినిమా సౌత్ లో కూడా సూపర్ హిట్ అయింది. ఆ విధంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా దేశంలోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న సినిమాగా నిలిచిపోయింది. బాలీవుడ్ లో కూడా ప్రకంపనలు ఈ సినిమా ద్వారా మొదలయ్యాయి. 

అందుకే ఈ సినిమాను ఆడియన్స్ కి నచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నారట.  స్క్రిప్ట్ పనులు కూడా ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం అని అంటున్నారు. నార్త్ వారికి నచ్చేలా ఉండేలా చూసుకుని తద్వారా మంచి విజయాన్ని, వసూళ్ళ ను అందుకోవాలని వారు భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం కొన్ని ఆసక్తికరమైన అంశాలను జోడించబోతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడిగా సుకుమార్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చేస్తున్న పుష్ప  యొక్క రెండవ భాగాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన పాత్ర శ్రీవల్లి ను రెండవ భాగంలో చంపబోతున్నాడని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ట్విస్ట్ ను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: