ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీ గా ఉంది. ఇటీవల కాలంలో ఆ మె నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మ తో
సినిమా చేసేందుకు పలువురు హీరోలు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో అగ్ర
హీరోయిన్ లు సైతం పెద్దగా లేకపోవడంతో ఈమెకు మంచి అవకాశాలు అందుకోవడానికి సిద్ధంగా ఉంది.
పూజా హెగ్డే మరియు
రష్మిక మందన ఇద్దరు అగ్ర కథానాయకులు ఈ
సినిమా లో నటిస్తున్నారు.
ఆ తరువాత రాశికన్నా అనుపమ పరమేశ్వరన్ వంటి
హీరోయిన్ లు ఉన్నా కూడా కొంతమంది హీరోలు వీరిని ఎంపిక చేసుకునేందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే అందరికీ సమాధానంగా నిలుస్తుంది కృతి. దీనికి తోడు గ్లామర్ విషయంలో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ. అందుకే మేకర్స్ అందరూ కూడా ఆమెనే తమ సినిమాలలో పెట్టుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం
రామ్ సరసన
వారియర్ అనే సినిమాలో నటిస్తున్న ఈమె సుధీర్ బాబు సరసన కూడా ఓ సినిమాలో నటిస్తోంది.
ఈ రెండు సినిమాలు కూడా భారీ చిత్రాలే కావడంతో ఈ సినిమాలు తప్పకుండా తనకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తుంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. భారీ యాక్షన్ సినిమాలు కావడంతో ఈ సినిమాలలో ఆమె పాత్ర ఎంతో వెరైటీగా ఉండబోతుంది అని చెబుతున్నారు. అంతే కాదు మరికొన్ని పెద్ద సినిమాలలో కూడా ఆమెకు
హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈమె నెంబర్ వన్
హీరోయిన్ గా మారుతుందని కూడా అంటున్నారు ప్రముఖ సినీ పండితులు. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె కు ఇదే మంచి అవకాశం అని చెప్పాలి. దానిని ఎలా వినియోగించుకుంటుందో కృతి.