ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయిన మెగా వారసుడు వైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడుగా ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చిన కూడా ఒక మంచి పాత్రతో ప్రేక్షకులను పలకరించిన ఆయన అందరి దృష్టిలో మంచి నటుడు అనిపించుకున్నాడు.  ఆ విధంగా వైష్ణవ్ తొలి సినిమాతో ఘన విజయం సాధించిన కూడా రెండవ సినిమాతో భారీ ఫ్లాప్ ను అందుకుని ద్వితీయ విఘ్నం దాటలేకపోయాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించాలేకపోయినిడ్. వంద కోట్ల వసూళ్లను సాధించిన ఈ హీరో ఇంత డిజాస్టర్ సినిమా చేస్తాడని ఎవరు కూడా ఊహించలేదు 

దాంతో ఆయనకు ఇప్పుడు మరొక భారీ స్థాయిలో విజయం అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే తమిళనాట అర్జున్ రెడ్డి సినిమా ను చేసిన గిరీశాయ దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా తొలి సినిమా రొమాంటిక్ చిత్రంతో ఆమెకు వచ్చిన నా క్రేజ్ అంతా ఇంతా కాదు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న కారణంగానే ఆమెకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు.

తన అందచందాలతో అందరినీ ఎంతగానో మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో తన నటనతో మరింతగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది అని అంటున్నారు.  ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉందని తప్పకుండా ఈ సినిమా ఎంతగానో ఆకర్షిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో కనుక మంచి విజయం సాధించకుంటే ఆయన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని మెగా అభిమానులు భావిస్తున్నారు. మెగా హీరోలలో ఇప్పుడు అందరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. మంచి విజయాలు సాధించే వీరి జాబితాలోకి వైష్ణవ్ తేజ్ కూడా చేరాలంటే విజయాలు అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: