దగ్గుబాటి రానా తాజాగా విరాట పర్వం మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రానా సరసన సాయి పల్లవి  హీరోయిన్ గా నటించగా,  ప్రియ మణి మరో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కి వేణు ఉడుగుల  దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో దగ్గుబాటి రానా... రవన్న అనే పాత్రలో నటించగా, సాయి పల్లవి... వెన్నెల అనే పాత్రలో నటించింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల అనేక సార్లు ఈ మూవీ వాయిదా పడింది. అనేక సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఎట్ట కేలకు నిన్న అనగా 17 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న విరాట పర్వం సినిమా మొదటి రోజు పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది.  విరాట పర్వం సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 48 లక్షలు .
సీడెడ్ : 7 లక్షలు .
యూ ఎ : 8 లక్షలు .
ఈస్ట్ : 6 లక్షలు .
వెస్ట్ : 5 లక్షలు .
గుంటూర్ : 7 లక్షలు .
కృష్ణ : 5 లక్షలు .
నెల్లూర్ : 4 లక్షలు .
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విరాట పర్వం మూవీ  0.90 కోట్ల షేర్ ను , 1.50 గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  0.12 కోట్లు .
ఓవర్ సీస్ లో : 0.40 కోట్లు .


విరాట పర్వం సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 1.42 కోట్ల షేర్ ను 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్  దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: