సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న టాలెంటెడ్ హీరోయిన్. ఫిదా చిత్రంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అప్పటి నుండి తన జోరు చూపిస్తూనే ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ భామ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పటికీ ఈ మధ్య కాస్త డౌన్ అయ్యింది వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో పెద్దగా ఆఫర్లు లేవని చాలానే వార్తలు వినపడుతున్నాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన విరాట పర్వం చిత్రం కి పాజిటివ్ టాక్ వస్తోంది. అలాగే సాయి పల్లవి పాత్రకు మంచి మార్కులు పడుతున్నాయి. ఈ చిత్రం లో సాయి పల్లవి పాత్ర చూసిన వారంతా లేడీ పవర్ స్టార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే సాయి పల్లవిని ఇటువంటి పాత్రలో చూసాక ఇక కమర్షియల్ సినిమాల్లో నార్మల్ హీరోయిన్ గా చూడటం కష్టమని కొందరు అంటున్నారు. ఇకపై సాయి పల్లవికి క్రేజీ హీరోయిన్ లాంటి పాత్రలు రావడం కష్టమే అంటున్నారు. దాంతో ఇక సాయి పల్లవి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుందేమో అంటున్నారు.         అభిమానులు సైతం కమర్షియల్ సినిమాల్లో కంటే విరాట పర్వం వంటి సినిమాల్లో అయితేనే సాయి పల్లవి బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సాయి పల్లవి తదుపరి ప్రాజెక్ట్ ల గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గతంలో కీర్తి సురేష్ చేసిన తప్పే ఇపుడు సాయి పల్లవి కూడా చేసిందని కొందరు అంటున్నారు. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఇలాగే కీర్తి సురేష్ కూడా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుని ప్రయోగం చేసిందని. ఆ తరవాత అలా అన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు బుక్ అయ్యి బుక్ అయిపోయారు అని ...ఏదో మహేష్ పుణ్యమా అని మళ్ళీ సర్కారు వారి పాట సినిమాతో మళ్ళీ గ్లామర్ ట్రాక్ లోకి వచ్చిందని, కీర్తి సురేష్ తో ఇపుడు సాయి పల్లవిని పోలుస్తున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: