అయితే సాయి పల్లవిని ఇటువంటి పాత్రలో చూసాక ఇక కమర్షియల్ సినిమాల్లో నార్మల్ హీరోయిన్ గా చూడటం కష్టమని కొందరు అంటున్నారు. ఇకపై సాయి పల్లవికి క్రేజీ హీరోయిన్ లాంటి పాత్రలు రావడం కష్టమే అంటున్నారు. దాంతో ఇక సాయి పల్లవి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుందేమో అంటున్నారు. అభిమానులు సైతం కమర్షియల్ సినిమాల్లో కంటే విరాట పర్వం వంటి సినిమాల్లో అయితేనే సాయి పల్లవి బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సాయి పల్లవి తదుపరి ప్రాజెక్ట్ ల గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గతంలో కీర్తి సురేష్ చేసిన తప్పే ఇపుడు సాయి పల్లవి కూడా చేసిందని కొందరు అంటున్నారు. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఇలాగే కీర్తి సురేష్ కూడా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుని ప్రయోగం చేసిందని. ఆ తరవాత అలా అన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు బుక్ అయ్యి బుక్ అయిపోయారు అని ...ఏదో మహేష్ పుణ్యమా అని మళ్ళీ సర్కారు వారి పాట సినిమాతో మళ్ళీ గ్లామర్ ట్రాక్ లోకి వచ్చిందని, కీర్తి సురేష్ తో ఇపుడు సాయి పల్లవిని పోలుస్తున్నారు.