ఇక దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో చాలా సినిమాలు ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధించాయి. బాహుబలి1, బాహుబలి2 ఇంకా అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు అసలు అన్నీఇన్నీ కావు.మెగా ఇంకా నందమూరి హీరోల కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించడం దర్శకధీరుడు రాజమౌళికి మాత్రమే సాధ్యమైంది. రాజమౌళి సినీ కెరీర్ లో అసలు ఫ్లాప్ లేదని చాలామంది భావిస్తారు.భారీ మొత్తాలకు రాజమౌళి సినిమా హక్కులను కొనుగోలు చేసినా కూడా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సందర్భాలు సైతం చాలా ఉన్నాయి. అయితే రాజమౌళి డైరెక్షన్ లో నితిన్ హీరోగా తెరకెక్కిన సై సినిమా మాత్రం అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదని సమాచారం. ఇక ఈ సినిమా నిర్మాతకు సైతం ఎక్కువ మొత్తం లాభాలు మిగలలేదని సమాచారం. స్టార్ డమ్ ఉన్న హీరోలను కాకుండా నితిన్ ను ఎంపిక చేసుకోవడం ఇంకా అలాగే చాలా క్లాస్ గా సినిమాను తెరక్కించడం వల్లే ఈ సినిమా రికార్డులు సృష్టించలేదు.


రాజమౌళి ఈ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో చాలా తడబడ్డారు. నితిన్ ఈ సినిమా తర్వాత వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక సై సినిమా తర్వాత ఎన్నో ప్లాపులు ఎదుర్కొని ఇష్క్ సినిమాతో మళ్లీ నితిన్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. తన తండ్రి సపోర్ట్ ఉండటంతో వరుసగా ఫ్లాపులు వచ్చినా నితిన్ ఇండస్ట్రీలో నిలద్రొక్కుకున్నారు. ప్రస్తుతం కెరీర్ విషయంలో నితిన్ అప్పటిలా కాకుండా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడానికి నితిన్ ఇప్పుడు తెగ కష్టపడుతున్నారు. ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో నితిన్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. నితిన్ ఇంకా కృతిశెట్టి కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: