ఇటీవల రవితేజ తో క్రాక్ వంటి యాక్షన్ కమర్షియల్ మూవీ తెరకెక్కించిన యువ దర్శకుడు గోపీచంద్ మలినేని, లేటెస్ట్ గా బాలయ్య తో ఒక భారీ యాక్షన్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అఖండ మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ అందుకున్న బాలయ్య, ఈ మూవీతో కూడా పక్కాగా సక్సెస్ కొట్టేలా మూవీ కోసం ఎంతో కష్టపడుతున్నట్లు టాక్. బాలయ్య కి జోడీగా శృతి హాసన్ నటిస్తున్న ఈ మూవీలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్ర చేస్తున్నారు.
ఇక మొన్న బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించడంతో పాటు మూవీపై భారీ అంచనాలు ఆ టీజర్ ఏర్పరిచింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బాలయ్య పాత్ర ఎంతో అద్భుతంగా  ఉండనుండగా, ఆయన పలికే డైలాగ్స్, పెర్ఫార్మన్స్, మాస్ సీన్స్ అదిరిపోనున్నట్లు టాక్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ నుండి నిన్న రాత్రి హీరోయిన్ శృతి హాసన్ షూట్ సెట్స్ లో సందడి చేస్తున్న పిక్ ని పోస్ట్ చేసారు దర్శకుడు గోపీచంద్ మలినేని, గతంలో తామిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బలుపు, క్రాక్ మాదిరిగా తప్పకుండా ఈ మూవీ కూడా సూపర్ హిట్ కొట్టి, తమ కాంబోలో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయం ని శృతి హాసన్ న ఉద్దేశించి చెప్పారు దర్శకుడు గోపీచంద్. కాగా ఈ సినిమా షూటింగ్ మరొక రెండు నెలలలో పూర్తి కానుండగా దసరా అనంతరం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. కాగా ఈ మూవీ టైటిల్ కూడా త్వరలో అనౌన్స్ చేయనుందట యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: