సూపర్ స్టార్ మహేష్ తో జక్కన్న రాజమౌళి త్వరలో ఒక భారీ ప్రతిష్టాత్మక మూవీ తీయనున్న విషయం తెలిసిందే. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఈ భారీ మూవీని పాన్ ఇండియా కి మించేలా పాన్ వరల్డ్ స్థాయిలో ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్నట్లు టాక్. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ పై కేవలం మహేష్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ఆడియన్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి.

వాస్తవానికి మహేష్, రాజమౌళి కాంబినేషన్ మూవీ ఎప్పుడో తెరకెక్కాల్సి ఉండగా, కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి ఎట్టకేలకు ఇప్పుడు కుదరడంతో అందరి దృష్టి ఈ మూవీ పై పడింది. కాగా ఈ మూవీని సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ తో కూడిన అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ వచ్చే ఏడాది జనవరి తరువాతనే మొదలవుతుందని, ఈలోపు కథ పై కసరత్తు చేయనున్న రాజమౌళి, అనంతరం మెల్లగా ఇతర నటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక మొదలెట్టనున్నారట. మొత్తంగా ఈ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే పట్టాలెక్కుతుందని, అనంతరం మూవీ తెరకెక్కి, ఆపైన అన్ని కార్యక్రమాలు ముగించుకుని పక్కాగా థియేటర్స్ లోకే వచ్చే ఛాన్స్ 2026 లోనే ఉంటుందని, అప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఓపికపట్టాల్సిందే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే అని, పక్కాగా ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన తరువాతనే పూర్తి వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరి అందరిలో ఇంత భారీ క్రేజ్ ఏర్పరుచుకున్న ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే కొద్దిరోజులు వెయిట్ చేయాలి.
 
 











మరింత సమాచారం తెలుసుకోండి: