ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా 12 వందల కోట్ల వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. ఇలా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి 1200 కోట్లు కొల్లగొట్టిన మొదటి సినిమాగా కే జి ఎఫ్ చాప్టర్ 2 అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అటు బాలీవుడ్ లో కూడా హవా నడిపిస్తూ ఉంటే ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ సైతం తన సినిమాలతో నార్త్ లో కూడా ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేశాడు అనే చెప్పాలి.


 ప్రశాంత్ నీల్ టేకింగ్ కి అటు అన్ని భాషల ప్రేక్షకులు కూడా మంత్రముగ్దులు అయ్యారు. అందుకే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా కి అంత పెద్ద విజయాన్ని కట్టబెట్టారు. అయితే సౌత్ నుంచి వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ సాధిస్తూ హిందీలో కూడా రాణిస్తున్న నేపథ్యంలో గత కొంత కాలం నుంచి సౌత్ నార్త్ అని రెండు ఇండస్ట్రీలు గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు సైతం సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్లో ఉన్న పరిస్థితుల గురించి కాస్త పెదవి విరుస్తున్నారు.


 ఇకపోతే ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా దర్శకుడిగా ఉన్న కరణ్ జోహార్ సైతం కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే నేను కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా చూశాను. మనస్ఫూర్తిగా చెబుతున్న ఈ సినిమా నాకు ఎంతగానో నచ్చింది. అయితే ఈ సినిమా కనుక బాలీవుడ్లో చేసి ఉంటే ఎన్నో విమర్శలు వచ్చేవి. కథలు ఎంచుకోవడం వాటిని అద్భుతంగా తెరకెక్కించే విధానంలో దక్షిణాది చిత్రాల దర్శకులకు ఉన్న నమ్మకం అటు బాలీవుడ్ లో మాత్రం లోపించింది అని అనిపిస్తుంది అంటూ కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇటీవల కాలంలో ఈ బాలీవుడ్ స్టార్ నిర్మాత సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: