బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న దీపికా పదుకొనే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను నాగ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే హైదరాబాద్ లో  జరుగుతున్న షెడ్యూల్లో ప్రభాస్ మరియు దీపికా పదుకొనే సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే దీపికా పదుకొనే కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు అనారోగ్యంగా ఉండడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు అని, అలా అనారోగ్యం పాలు కావడంతో దీపికా పదుకునే ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ నుండి వెళ్ళిపోయింది అని, దానితో సినిమా షూటింగ్ ఆగిపోయింది అని అనేక రూమర్ లు బయటకు వచ్చాయి.

ఈ రూమర్ లకు చెక్ పెడుతూ తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కొన్ని విషయాలను తెలియజేశాడు.  దీపికా పదుకొనె కి బీపీ కి సంబంధించిన సమస్య ఉంది అని,  దాని వల్లే అప్పుడు ఆమె అసౌకర్యంగా ఫీలయ్యింది అని, ఆ సమయంలో ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా,  గంటలోనే మళ్ళీ ఆమె తిరిగి కోలుకుంది అని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగా ఉందని మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటుంది అని అశ్వినీ దత్ క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: