మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . తాజాగా ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ ,  భోళా శంకర్, బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమాలతో పాటు టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయినా వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాలో నటించబోతున్నాడు .

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా కాలమే అవుతుంది . ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఇప్పటికే మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ ,  ఒక సినిమాను  లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ ని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి , వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి , వినాయక్ కాంబినేషన్ లో ఠాగూర్ , ఖైదీ నెంబర్ 150 సినిమాలు తెరకెక్కాయి .

ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ లుగా నిలిచాయి. అలా వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాలతో కూడా రెండు విజయాలను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా అవకాశాన్ని వి వి వినాయక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: