బాలీవుడ్ సినిమాల ద్వారా నాచురల్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈమె తెలుగులో మొదటి సారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్లు వస్తున్నా కూడా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఈమె హిందీ లోనే ఎక్కువగా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ఆ సినిమాలతోనే ఎక్కువగా సక్సెస్ సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండగా ఆలియా భట్ నటించిన గంగూ భాయ్ కతియవాడి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఆలియాభట్ విటులను ఆకర్షించడానికి చేతితో సైగ చేసే ఒక సన్నివేశం కూడా ఉంటుంది. అయితే పాకిస్థాన్ కి  చెందిన ఒక రెస్టారెంట్ నిర్వాహకులు ఇదే పోస్టర్ ను  ప్రింట్ చేసి రెస్టారెంట్లో పెట్టుకోవడం చాలా ఆసక్తికరంగా మారింది.ఇక ఆ వీడియోను వాడుకుంటూ రెస్టారెంట్ నిర్వాహకులు మగవాళ్లకు 25% డిస్కౌంట్ కూడా ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది. కరాచీలోని మెన్స్ మండే రెస్టారెంట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో కూడా నెట్టింట భాగం వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

చాలామంది నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్ కూడా వస్తున్నాయి. రెస్టారెంట్ నిర్వాహకులు స్త్రీలపై ద్వేషం తో ఇలా ఆఫర్ ను ప్రకటించి ఉండవచ్చు అని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ వీడియో పై ఆలియా భట్  ఏదైనా స్పందిస్తుందా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఇక ఆలియా భట్ మాత్రం తన సినిమాలతో బిజీగా ఉంటూ ప్రేక్షకులను మెప్పించ డానికి ఎప్పటికప్పుడు తన మేక్ఓవర్ ను కూడా చేంజ్ చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: