సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటికే అతడు , ఖలేజా సినిమాలు తెరకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ రెండు మూవీ లలో అతడు సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది . ఖలేజా సినిమా మాత్రం థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయిన ప్పటికీ టీవీ లలో మాత్రం ప్రేక్షకులను ఇప్పటికీ బాగానే అలరిస్తూ వస్తోంది .

ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా కూడా ఇప్పటికే రావలసింది .  కాక పోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది .  అసలు విషయం లోకి వెళితే ...  మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడవ సినిమా దాదాపు పదేళ్ల క్రితమే రావలసింది.  వీరిద్దరి కాంబినేషన్ లో  'సైన్యం' అనే పేరుతో ఒక సినిమా కూడా దాదాపుగా ఖరారు అయ్యింది. ఎం ఎస్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని రూపొందించాలి అనుకున్నారు. ఈ సినిమా కోసం చాలా రోజుల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయట. కాక పోతే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోయినట్లు తాజాగా ఏం ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూ లో తెలియజేశాడు .

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడవ సినిమా మొదలు కాబోతోంది. ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది.  ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: