టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయిన రాధాకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాధాకృష్ణ 'జిల్' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా దర్శకుడిగా మంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు.

ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించగా రాశి కన్నా కథానాయికగా నటించింది. ఇలా జిల్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తదుపరి సినిమా ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను దర్శకత్వం వహించే అవకాశాన్ని రాధాకృష్ణ దక్కించుకున్నాడు. అందులో భాగంగా రాధాకృష్ణ , రెబల్ స్టార్ ప్రభాస్ తో 'రాధే శ్యామ్' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాడు.  ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల  అయ్యింది.  అనేక అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది .

సినిమా దాదాపు 100 కోట్ల వరకూ నష్టాలను మిగిల్చి నట్లు ప్రచారాలు కూడా జరిగాయి. ఇలా రాధే శ్యామ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న రాధాకృష్ణ మరోసారి తనకు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందించిన గోపీచంద్ తో మూవీ ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రాధాకృష్ణ,  గోపీచంద్ కు ఒక కథ కు సంబంధించిన లైన్ ను వినిపించినట్లు,  దానితో గోపీచంద్ పూర్తి కథను తయారు చేసుకో అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ 'పక్కా కమర్షియల్' మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమా జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: