త్రిబుల్ ఆర్ షూటింగ్ ముగిసిందో లేదో అంతలోనే మరో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో సినిమాకు రెడీ అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఆర్సి 15 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. దీంతో ఇక ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అని ఎన్నో రోజుల నుంచి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. కాగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అటు రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథ అందించారు.


 అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఈ వార్త గత కొంత కాలం నుంచి వైరల్ గా మారిపోయింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారట మేకర్స్. ఇకపోతే ఇటీవల ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సర్కారోడు అనే టైటిల్ ను శంకర్ పరిశీలిస్తున్నారని టాక్ వినిపించింది.



 కాగా టైటిల్కు  సంబంధించి మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన చేయడానికి కూడా దర్శకుడు శంకర్ సిద్ధమైపోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్త పేరు తెరమీదికి వచ్చింది. సర్కారోడు కాదు అధికారి అనే టైటిల్ పరిశీలనలో ఉంది అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు సర్కారోడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక శంకర్ మరికొన్ని రోజుల్లో ఈ టైటిల్ని అధికారికంగా ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rc