కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన విగ్నేష్ నయనతార దంపతులు ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.ఇన్నాళ్లూ బ్యాచిలర్ గా గడిపిన నయనతార ఓ ఇంటిది కావడంతో ఆమె అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నయనతార పెళ్లికి కొద్ది మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులు వెళ్లడం తప్పించి పెద్దగా ఎవరినీ పిలువలేదు. అంతేకాదు వీళ్లతో పాటు ఫ్యాన్స్ కూడా నయనతార పెళ్లి వేడుకకు హాజరు కాలేదు. దీంతో వీళ్లంతా నయన్ దంపతులు ఇచ్చే రిసెప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మొన్నటి వరకు చెన్నైలో భారీ స్థాయిలో రిసెప్షన్ పెడతామన్న ఈ జంట..

 పెళ్లి అయి పది రోజులు అవుతున్నా రిసెప్షన్ పై మాత్రం స్పందించడం లేదు. ఇప్పటి వరకు దీనిపై అసలు నోరు మెదపడం లేదు. అయితే ఇప్పుడేమో వీళ్ళ రిసెప్షన్ క్యాన్సల్ అంటూ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అయితే నయన్ దంపతుల రిసెప్షన్ క్యాన్సిల్ వెనక ఒక మంచి కారణం ఉందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే తమ రిసెప్షన్ కోసం ఖర్చు పెట్టాలి అనుకున్న భారీ మొత్తాన్ని తమిళనాడులోని అన్ని అనాథ ఆశ్రమాలకు పంచాలని నయన్ దంపతులు భావించారట. దీంతో ఒకరోజు పూర్తిగా తమిళనాడులో ఉన్న అన్ని అనాథ ఆశ్రమాలకు ఆహారం పెట్టే అంత మొత్తాన్ని నయన్ దంపతులు ఇచ్చారని సమాచారం వినిపిస్తోంది.

వాళ్లు అనుకున్నట్టుగా రిసెప్షన్ జరిగితే కొద్దిమంది మాత్రమే వాళ్లను గుర్తుంచుకునే వారు. కానీ ఇప్పుడు నయన్ దంపతులు చేసిన ఈ మంచి పనికి అందరూ ఎంతగానో అభినందిస్తున్నారు. మీ పై ఉన్న గౌరవం మరింత పెరిగింది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు సైతం నయన్ దంపతుల నిర్ణయానికి శభాష్ అంటున్నారు. ఇక త్వరలో ఈ దంపతులు దేశంలోని అన్ని దేవాలయాలను సందర్శించబోతున్నారు. ఇక అన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కొన్ని రోజులు ఇద్దరు ఏకాంతంగా విదేశాలకు హనీమూన్ కోసం వెళ్తారట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: