తమిళనాట భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న
శంకర్ ఇప్పుడు తెలుగులో
రామ్ చరణ్ తో కలిసి ఓ
సినిమా చేస్తున్నాడు.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా చిత్రబృందం ప్రణాళికలు చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఆర్ ఆర్ ఆర్
సినిమా తర్వాత
రామ్ చరణ్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మెగా అభిమానుల్లో భారీ స్థాయిలో ఉన్నాయి.
అయితే అంతకుముందు
శంకర్ చేసిన
భారతీయుడు2 సినిమా మధ్యలో ఆగిపోవడం మెగా అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది. ఎన్నో అంచనాలు ఉన్న ఈ
సినిమా చేయాలని భావించి భంగపడ్డాడు శంకర్. పలు కారణాల వల్ల ఆ
సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో తమిళనాట ఈ దర్శకుడితో
సినిమా చేయడానికి ఏ
హీరో కూడా ముందుకు రాలేదు. అందుకే ఇప్పుడు తెలుగుపై కాన్సన్ట్రేట్ చేశాడు. అందులో భాగంగా చరణ్
సినిమా చేస్తూ ఉండగా ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించాలని భావిస్తున్నాడు.
అర్జున్ హీరోగా నటించిన ఒకే ఒక్కడు
సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అప్పుడు ఓ ట్రెండ్ సృష్టించిన ఈ
సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కించాలని
శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. చరణ్ తో చేస్తున్న
సినిమా తర్వాత ఓ తెలుగు
హీరో తోనే ఈ
సినిమా చేయాలని ఆయన భావిస్తున్నాడట. మరి
శంకర్ తో చేయబోయే ఆ అవకాశాన్ని
హీరో అందుకుటారో చూడాలి. ఇంకోవైపు కమల్ హాసన్ కూడా భారతీయుడు
సినిమా సీక్వెల్ పనులను మళ్లీ మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. నిర్మాణ సంస్థ కి దర్శకుడు
శంకర్ కి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమలహాసన్ ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి.