తెలుగునాట మాస్ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు వి వి వినాయక్.  దిల్ సినిమాతో ఆయన తన సినిమా కెరీర్ ను ప్రారంభించి దర్శకుడుగా ఈ స్థాయికి ఎదిగాడు.  మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ వంటి పెద్ద హీరోలతో కలిసి పనిచేసిన ఆయన ఆ రోజులలో తన స్టామినాను ప్రేక్షకులందరికీ తెలియజేశాడు. ఇటీవల కాలంలో కొత్త దర్శకులు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఈ దర్శకుడికి పెద్దగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.

ప్రస్తుతం కొండ శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆయన చత్రపతి రీమేక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతకుముందు ఆయన  చిరంజీవితో కలిసి మరో సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా కథ పరంగా చిరంజీవిని మెప్పించకపోవడంతో ఆయనకు ఆ సినిమా అవకాశం దూరం అయ్యింది. అలా ఆ సినిమా ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. గాడ్ ఫాదర్ అనే సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. దసరా కానుకగా ఈ సినిమా ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. మలయాళ సినిమా లుసిఫర్ కి ఇది తెలుగు రీమేక్ సినిమా. 

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం వినాయక్ చిరంజీవికి మంచి కథను తయారు చేశాడని ఇటీవలే ఆయనకు వినిపించి ఓకే కూడా చేశాడని తెలుస్తుంది.ఇప్పుడు చేస్తున్న చిరంజీవి సినిమాలు అన్ని పూర్తి అయిన తర్వాత ఈ చిత్రాన్ని మొదలు పెట్టే విధంగా ఆయన డేట్స్ ఇచ్చారని అంటున్నారు. ఈలోపు చత్రపతి సినిమా రీమేక్ ను కూడా వినాయక్ పూర్తి చేయనున్నాడు. మరి ఇటీవల కాలంలో ఆయనకు పెద్ద హీరోలు ఛాన్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్న నేపథ్యంలో చిరంజీవితో ఆయన సినిమా ఓకే చేసుకోవడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఈ సినిమాతో మళ్లీ కం బ్యాక్ చేసి భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆయన అలరిస్తారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: