మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియ ల్ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆయన చేసిన ప్రతి రోజు పండగే సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకోగా ఆ తర్వాత ఆ యన చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి రవితేజతో కలిసి ఆయన తదుపరి సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అది కుదర లేదు. రమణ దేశం కారణంగా ఆ చిత్రం రవితేజ చేయడానికి ఒప్పుకోలేదు.

ఇప్పుడు అదే కథ తో గోపీచంద్ హీరోగా ఈ సినిమా చేస్తున్నా డు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తూ ఉండగా వీరిద్దరూ కూడా లాయరుగా ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడు దలయ్యాయి. ఇవి ప్రేక్షకులలో మంచి అంచనాలను ఏర్పరిచింది. గోపీచంద్ కూడా సరైన విజయం దక్కి చాలా రోజులు అయిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుంది అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

సినిమా తర్వాత మారుతి ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేస్తు న్నాడనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తో ఉండగా మరికొంతమంది మారుతి ప్రభాస్ తో సినిమా చేయడం లేదు అనే వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిని మాపై ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు ఈ కాంబినేషన్లో సినిమా గురించి అనుకుంటున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ తో చేయటం కుదరకపోతే నాని తో చేయడానికి సిద్ధం అవుతానని అని చెప్పాడట ప్రస్తుతం కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై ఒకటవ తేదీన ఈ సినిమా యొక్క విడుదల జరగనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: