టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ లవబుల్ కపుల్ సమంత నాగచైతన్య గతేడాది విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.వీరి విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇక విడాకుల తర్వాత సమంత తన కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే వరుస సినిమాలకు సైన్ చేస్తుంది. మరోవైపు ఈ ఏ బ్రాండ్ ని,ఏ కవర్ పేజి ని కూడా విడిచి పెట్టడం లేదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇక ఇప్పటికే సాంగ్ నటించిన శాకుంతలం, యశోదా వంటి లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి. వీటితోపాటు తాజాగా శివ నిర్మాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తోంది.

ఇటీవల ఈ సినిమా కాశ్మీర్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా మొదలు కానుంది. అటు బాలీవుడ్లో ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ దర్శకులతో మరో వెబ్ సిరీస్ చేస్తోంది సమంత. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ అగ్ర హీరో వరున్ దావన్ కూడా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటె సమంత ఇటీవల బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న 'కాఫీ విత్ కరణ్ షో'లో పాల్గొంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి సమంత పాల్గొన్న ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది అని తెలుస్తోంది. నిజానికి చైతూ తో విడాకుల తర్వాత ఓ ప్రత్యేకమైన టాక్ షో లో సమంత ఇప్పటివరకు పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కాఫీ విత్ కారణం షోలో సమంత ఆసక్తికర విషయాలు వెల్లడించిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులకు సంబంధించిన అంశాలను కూడా కరణ్ జోహార్ కి షోలో ప్రసాదించాడని సమంత కూడా దీనిపై స్పందించాలని ముంబై మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చైతూ తో విడాకుల విషయంలో సమంతా పలు సంచలన నిజాలు కూడా బయట పెట్టిందని అంటున్నారు. దీంతో ఈ టాక్ షో కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ షో కు సంబంధించి ఆరు సీజన్లను పూర్తిచేశాడు కరణ్ జోహార్. సమంత కు సంబంధించిన ఎపిసోడ్ను త్వరలోనే టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇక సమంత కు సంబంధించిన ఎపిసోడ్ తర్వాత కరణ్ జోహార్ తనతోపాటు విజయ్ దేవరకొండ, నిత్యామీనన్, సాయిపల్లవి వంటి స్టార్స్ ని కూడా ఆహ్వానించాడట. ఇక ఈ టాక్ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: