దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ విడుదలైన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దగ్గుబాటి రానా రవన్న అనే నక్సలైటు పాత్రలో నటించాడు. ఈ సినిమాను దర్శకుడు వేణు అడుగుల నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథను జోడించి తెరకెక్కించాడు. ఈ సినిమా లోని రానా నటనకు సాయి పల్లవి నటనకు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో నటించగా, ఈ సినిమాకు సురేష్ బెబ్బులి సంగీతాన్ని అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన విరాట పర్వం సినిమా ఇప్పటి వరకు రెండు రోజుల బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది. రెండు రోజుల్లో విరాట పర్వం సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.
నైజాం : 82 లక్షలు .
సీడెడ్ : 12 లక్షలు .
యూ ఎ : 14 లక్షలు .
ఈస్ట్ : 11 లక్షలు .
వెస్ట్ : 8 లక్షలు .
గుంటూర్ : 11 లక్షలు .
కృష్ణ : 9 లక్షలు .
నెల్లూర్ : 6 లక్షలు .
2 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విరాట పర్వం సినిమా 1.53 కోట్ల షేర్ , 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  0.20 కోట్లు .


ఓవర్ సీస్ లో : 0.54 కోట్లు . ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజులకు గాను విరాట పర్వం మూవీ 2.27 కోట్ల షేర్ ,  3.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: