దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో విలన్ గా నటించి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రానా కొన్ని రోజుల క్రితం విడుదలైన భీమ్లా నాయక్ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇలా భీమ్లా నాయక్ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న దగ్గుబాటి రానా తాజాగా నటించిన విరాట పర్వం సినిమా జూన్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో దగ్గుబాటి రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా, ఈ మూవీ లో ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కి నీది నాది ఒకే కథ మూవీ తో దర్శకుడి గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న విరాట పర్వం సినిమా విడుదలైన మొదటి షో నుండే బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకొని ప్రస్తుతం మంచి కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర రాబడుతోంది. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా విరాట పర్వం మూవీ కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

ఇది ఇలా ఉంటే విరాట పర్వం సినిమాకు డిజిటల్ హక్కుల ద్వారా  అదిరిపోయే రేంజ్ లో లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నేట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. విరాట పర్వం సినిమా హక్కులను నేట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 15 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇదే కనుక నిజమైతే విరాట పర్వం సినిమా అదిరిపోయే లాభాలను తెచ్చుకున్నట్లే అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: