టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి వఖిల్ సబ్ మూవీ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్  సినిమాలో నటించాడు. ఇది ఇలా ఉంటే దాదాపుగా  భీమ్లా నాయక్ సినిమాతో పాటే పవన్ కళ్యాణ్  'హరిహర వీరమల్లు' సినిమాను కూడా మొదలు పెట్టాడు. కాకపోతే పవన్ కళ్యాణ్  'భీమ్లా నాయక్' సినిమాపై కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, అలాగే హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా హరిహర వీరమల్లు సినిమాను ఆపి వేసి కొండ పొలం అనే సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అలా కొంత కాలం పాటు ఆగిపోయిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొన్ని రోజు క్రితమే తిరిగి ప్రారంభం అయ్యింది. తిరిగి ప్రారంభం అయిన తర్వాత హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.  ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్సినిమా సగోటింగ్ ని త్వరగా ముగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఆగస్ట్ వరకు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని క్రిష్ జాగర్లమూడి కి డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే క్రిష్ జాగర్లమూడి కూడా ముందుగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాలను తీయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ హరి హరి వీరమల్లు సినిమాను త్వరగా ముగించడానికి క్రిష్ జాగర్లమూడి డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: