టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సౌత్ తో పాటు బాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.అయితే తాజాగా ఆమెకు తమిళ నిర్మాతలు భారీ షాక్ ఇచ్చారని ప్రచారం మొదలైంది. గతంలో తలపతి విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది పూజా హెగ్డే. ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఇప్పుడు పూజా హెగ్డే కు షాక్ ఇచ్చిందని తమిళ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్ సమయంలో పూజ చేసిన కొన్ని అనవసరమైన ఖర్చుల విషయంలో ఆమె కు భారీ షాక్ ఇచ్చారట నిర్మాతలు. బీస్ట్ సినిమా షూటింగ్ సమయంలో ఆమె అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయించారనే విషయం తెలుసుకున్న సన్ పిక్చర్స్ సంస్థ..

 ఆమె కమిట్ మెంట్ ఇచ్చిన దానికంటే ఎంత ఎక్కువ ఖర్చు చేయించారనే లెక్కలు పూర్తిగా బయటకు తీసి వాటికి సంబంధించిన బిల్ల్స్ ఆమెకు పంపించారట. మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టిన అమౌంట్ కట్టాలి అంటూ వారు పూజా హెగ్డేకి గట్టిగానే చెప్పారని తెలుస్తోంది. కచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందేనని పేర్కొనడంతో ఇప్పుడు ఆ డబ్బు కట్టేందుకు పూజా హెగ్డే సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాను స్టార్ హీరోయిన్ గా ఉన్నాను కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త అటు ఇటుగా చూసి వదిలేస్తారని భావించిందట పూజాహెగ్డే. అందుకే ఖర్చుల విషయంలో ఆమె మాత్రం వెనకాడకుండా తనతో పాటు తన పర్శనల్ స్టాప్ మొత్తాన్ని తీసుకొని వచ్చిందట.

కానీ అనుకున్న దాని ప్రకారం మాత్రమే తాము డబ్బులు చెల్లించాలని కానీ మీరు పెట్టిన వృధా ఖర్చు కూడా ఇప్పుడు చెల్లించాము కాబట్టి కచ్చితంగా డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరడంతో పూజా హెగ్డే ఈ విషయంలో సైలెంట్ అయిందని తెలుస్తోంది. దీంతో ఎలాగైనా సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ పూజ హెగ్డే తో ఆ డబ్బులు కట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయిమ్ ఒక విధంగా ఇది పూజా హెగ్డే కి భారీ షాక్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: