ఆషూ రెడ్డి.. యూట్యూబ్ చానెల్స్ ద్వారా ఫెమస్ అయ్యిన ముద్దుగుమ్మ..అమ్మడు పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియా ద్వారా బాగా ఫెమస్ అయ్యింది.అయితే రెండు సార్లు బిగ్ బాస్ కు కూడా వెల్లింది..అలా ఇంకా ఫెమస్ అయ్యింది.కొన్ని షోలు కూడా చేసింది.మొత్తానికి బోల్డ్ బ్యూటీ గా అందరి మనసులను దొచుకుంది..ఇకపోతే ఈ మధ్య అందాల డోస్ కాస్త పెంచింది.అందరూ ఆమె పై మనసు పారెసుకున్నారు.


కాగా, ఈమధ్య ఎక్కువగా దుబాయ్‌కు వెళ్లొస్తోంది. అక్కడేం పని ఉందో తెలియడం లేదు గానీ.. ఎప్పుడూ దుబాయ్‌ ట్రిప్ వేస్తూనే ఉంది.అదేదో పక్క ఊరికి వెళ్లొచ్చినంత ఈజీగా పోతోంది. అషూ రెడ్డి ఈ ఏడాదిలోనే మూడు నాలుగు సార్లు వెళ్లినట్టుంది. తాజాగా మరోసారి దుబాయ్ ట్రిప్ వేసింది. అషూ దుబాయ్ ట్రిప్ వేసినప్పుడల్లా ఏదో ఒక చెత్త కామెంట్లు వినిపిస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఓ సారి అషూ రెడ్డి దుబాయ్‌లో దిగిన ఫోటోలు, వాటిని షేర్ చేసిన విధానం మీద ఎంతగా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలిసిందే. నెగెటివ్ కామెంట్ల మీద అషూ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇంత కంటే గొప్పగా ఏం ఆలోచిస్తారులే అన్నట్టుగా కౌంటర్లు వేసింది.


మొత్తానికి అషూ రెడ్డి మాత్రం ఈ మధ్య నానా హంగామా చేస్తోంది. దుబాయ్ ట్రిప్ అంటుంది.. అక్కడ లక్షల విలువైన వస్తువులు కొంటుంది. వాటితో ఓ యూట్యూబ్ వీడియో చేస్తుంది. ఆమధ్య ఇలానే చేసింది. తన తల్లి కోపాన్ని కూడా చూపించింది. లక్షల విలువైన హ్యాండ్ బ్యాగ్ కొనేసిందని, దాన్ని కాల్చి పడేసింది.. ఆ వీడియో బాగానే ట్రెండ్ అయింది. అలా మొత్తానికి అషూ రెడ్డి మాత్రం నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటుంది. యూట్యూబ్ వీడియోలు అంటుంది.. ఇన్ స్టాలో రీల్ వీడియోలు అంటుంది. అయితే ఇప్పుడు అషూ రెడ్డి మాత్రం బుల్లితెరపై ఎక్కుగా కనిపించడం లేదు...దుబాయ్‌కు వెళ్లిన అషూ.. మొత్తానికి తిరిగి వస్తోంది. బుర్జ్ ఖలీఫాను చూస్తూ అలా ఉండిపోయింది.. నీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టుంది.. అంటూ దుబాయ్‌ను విడిచి వెళ్లొస్తూ బాధపడినట్టుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: