రకుల్ ప్రీతిసింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టింది. అక్కడ సక్సెస్ తో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటూ మంచి పారితోషికం కూడా తీసుకుంటుంది. ఇకపోతే డిజాస్టర్స్ ఎన్ని వచ్చినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడ నటించిన వారితోనే మళ్లీ అవకాశం వస్తే నటించడానికి కూడా సిద్ధంగా ఉంది రకుల్ ప్రీతీ సింగ్. ఇకపోతే ఇప్పటివరకు అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ల తో రెండు సినిమాలు చేసినా మళ్లీ వారిద్దరితో కలిసి ఇంకో సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇక వారితో వున్న అనుబంధం గురించి కూడా ఆమె మాట్లాడుతూ క్లారిటీగా తెలియజేసింది.

ఇదివరకే రకుల్ ప్రీతిసింగ్ దే దే ప్యార్ దే, రన్ వే 34 సినిమాలు చేసింది. ఇంకొకవైపు సిద్ధార్థ్ మల్హోత్రా తో కూడా మార్జావన్ సినిమాలు చేసింది. అయితే ఈ రెండు సినిమాలతో కూడా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ కాకపోయినా అవకాశాలు మాత్రం అందుకుంటోంది.  ఇక ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కూడా బాగానే వస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈమె ప్రస్తుతం అజయ్ దే,  సిద్ధార్థ మల్హోత్రా తో కలిసి థ్యాంక్ గార్డ్ అనే సినిమాలో నటిస్తోంది. ఇక విభిన్నమైన డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి. ఇకపోతే ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె పాల్గొని వారితో ఉన్న అనుబంధం గురించి వెల్లడించింది.

అజయ్ దేవగన్ తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన నటుడు అని.. ఎలాంటి సలహా ఇచ్చినా కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటారు అని ఆమె తెలిపింది. సిద్ధార్థ్ మల్హోత్రా అయితే తనకు మంచి స్నేహితుడు అంటూ మొదటి పరిచయంలోనే అతనితో మంచి స్నేహం ఏర్పడింది అని అందుకే ఈ ఇద్దరితో కలిసి పాత్రలకు తగ్గట్టుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను అని కూడా తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: