నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అధికారికం గా ప్రకటించబడి చాలా రోజులు అవుతున్నా కూడా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి ముందుకు వెళ్లడం లేదు. అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంత వరకు జరిగింది. హీరో లేని సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు. ఆ తర్వాత హీరో రాక కోసం ఇన్నాళ్ళు వేచి చూశాడు.

అయితే ఇతర సినిమా పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ చిత్రానికి డేట్లు కేటాయించలేక పోతున్నాడు దానికి తోడు ఆయన నటించిన సినిమా లు బాక్సాఫీసు వద్ద చతికిల బడటంతో ఇప్పుడు చేయబోయే సినిమాలు తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి ఆయన ఇప్పుడు చేస్తున్న ఈ చిత్రంపై మరింత జాగ్రత్త తో సినిమా చేస్తున్నాడు. దాంతో ఆ సినిమాకు ఎక్కువ రోజులు సమయం పడుతుండటంతో నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్లో ఆయన చేసిన ఆదిపురుష్ చిత్రం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా విడుదల చేయనున్నారు. వేసవిలో సలార్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కె సినిమా వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలని ప్రభాస్ ఆలోచన చేస్తున్నారట. అందు కే ఆ సినిమా షూటింగు ను ఆలస్యం చేస్తున్నాడట. ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్సినిమా పూర్తి చేయడానికి మరొక సంవత్సరం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు దీపికా పడుకొనే కూడా ఈ మధ్య ఆసుపత్రిలో చేరడం ఈ సినిమా ముందుకు వెళ్లక పోవడానికి మరొక కారణం అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: