మహేష్ బాబు హీరోగా
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు మరియు
ఖలేజా సినిమాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో మెప్పించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెరకెక్కబోయే ఈ మూడో
సినిమా సక్సెస్ ను అందుకుని వారి కాంబో కి హ్యాట్రిక్ హిట్ అందించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్ కూడా ఈ
సినిమా విషయంలో మంచి క్లారిటీ గా ఉండడం విశేషం.
ఈ
సినిమా యొక్క
పూజా కార్యక్రమాలలో
హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొని ఈ చిత్రంలో తానే
హీరోయిన్ అన్నట్లుగా అధికారికంగా చెప్పేసింది. అయితే గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తల ప్రకారం
పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని అంటున్నారు ఇందులో వాస్తవం ఏంటో తెలియదు కానీ కొంతమంది ఈమె ఈ సినిమాలో లేదు అని కొంతమంది అంటుంటే ఇంకా కొంతమంది ఈమె ఈ సినిమాలో ఉంది అని అంటున్నారు. మరి దీనిపై ఎవరు కూడా క్లారిటీ ఇవ్వకపోవడం అభిమానులను ఇంకా అయో మయానికి గురి చేస్తుంది.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్టును
త్రివిక్రమ్ వినిపించారు. దానికి ఎంతగానో ఇంప్రెస్ అయిన మహేష్ బాబు ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడదామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నాడు ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు తిరిగి రాగానే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టబోతన్నాడు.
జూన్ మూడవ వారం నుంచి ఈ
సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు గా తెలుస్తుంది.
తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత
రాజమౌళి దర్శకత్వంలో
సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ
సినిమా ను వచ్చే ఏడాది మొదలుపెట్టాలని యూనిట్ భావిస్తుంది.