ఇక ఆ తర్వాత వచ్చిన ధ్రువ సినిమా తో మళ్ళీ మంచి ఫాంలోకి వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం సినిమా తో మరింత ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చెవిటి అబ్బాయి గా రామ్ చరణ్ నటించి ప్రేక్షకులను బాగా అలరించారు అని చెప్పవచ్చు. ఆ తర్వాత కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న రామ్ చరణ్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తీసి పాన్ ఇండియా హీరోగా చలామణి అయ్యారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఆయన తన సమయాన్ని ఎక్కువ రోజులు కేటాయించినందుకు గాను ఏకంగా 45 కోట్ల రూపాయలను పారితోషకం గా తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఇప్పుడు కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో #RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 60 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ రెండు సినిమాలతో రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో తెలియాల్సి ఉంది.